Asianet News TeluguAsianet News Telugu

పిటిషన్ ను త్వరగా విచారించలేం: కవితకు సుప్రీంలో చుక్కెదురు

ఈ నెల  24వ తేదీ కాకుండా  త్వరంగా  పిటిషన్ ను  విచారించాలని  కవిత  చేసిన అభర్ధనను  సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

Supreme Court  Denies  To  Early  hearing  on  BRS MLC  Kalvakuntla  Kavitha petition
Author
First Published Mar 17, 2023, 12:24 PM IST

హైదరాబాద్: తన పిటిషన్ ను త్వరగా  విచారించాలని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత  అభ్యర్ధనను  సుప్రీంకోర్టు తిరస్కరించింది.  ఈ నెల  24వ తేదీనే  ఈ పిటిషన్ ను విచారిస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.  

ఈ నెల  15వ తేదీన  సుప్రీంకోర్టులో  కల్వకుంట్ల కవిత  పిటిషన్ దాఖలు  చేశారు. ఈడీ విచారణను  సుప్రీంకోర్టులో  సవాల్  చేశారు.  మహిళలను ఈడీ అధికారులు విచారించవచ్చా అని  కూడా  ఆ పిటిషన్ లో  కోరారు.దర్యాప్తు అధికారులు  విచారణ సమయంలో  చిత్రహింసలకు గురి చేస్తున్నారని  ఆరోపించారు.  ఈ పిటిషన్ పై  ఈ నెల  24న విచారణ చేస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.  అయితే  ఇవా ళ  సుప్రీంకోర్టు  ప్రారంభమైన సమయంలో  సీజేఐ  ధర్మాసనం ముందు కవిత  న్యాయవాదులు  ఈ పిటిషన్  గురించి ప్రస్తావించారు.  ఈ పిటిషన్ ను త్వరగా  విచారించాలని  సీజేఐ దర్మాసనాన్ని కోరారు. అయితే  త్వరగా  విచారించాలన్న  కవిత  తరపు న్యాయవాదుల అభ్యర్ధనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.  ఈ నెల  24నే విచారణ  చేస్తామని    సుప్రీంకోర్టు  తేల్చి చెప్పిందని  ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల 20వ తేదీన   కవిత విచారణ  కావాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల  16వ తేదీన  కవిత  ఈడీ విచారణకు  హాజరు కావాలి. కానీ  నిన్న  ఈడీ విచారణకు  ఆమె హాజరు కాలేదు.  సుప్రీంకోర్టులో తన పిటిషన్ లో  పెండింగ్ లో  ఉందని ఆ లేఖలో  పేర్కొన్నారు. సుప్రీంకోర్టు  తీర్పు తర్వాత  విచారణకు  హాజరు కానున్నట్టుగా  ఆమె స్పష్టంచేశారు.  కానీ ఈడీ  ఈ నెల  20వ తేదీన విచారణకు  రావాలని ఈడీ అధికారులు  మరోసారి  కవితకు నిన్న నోటీసులు జారీ చేశారు. దీంతో  తన పిటిషన్ ను త్వరగా విచారించాలని  కవిత  కోరారు. కవిత  అభ్యర్ధనను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు: నేడు సుప్రీంకోర్టుకు కవిత

ఇదిలా ఉంటే  అరుణ్ రామచంద్రపిళ్లైకి ఈడీ కస్టడీని ఈ నెల  20వ తేదీ వరకు  కోర్టు పొడిగించింది.  ఇవాళ  ఈడీ విచారణకు  ఆడిటర్ బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ నెల  18న  వైసీపీ  ఎంపీ మాగుంట  శ్రీనివాసులు రెడ్డి  హాజరు కానున్నారు. కవిత ను ఇతరులతో కలిపి విచారించాలని  ఈడీ ప్లాన్ గా  కన్పిస్తుంది.  ఈ కారణంగానే అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని  కోర్టును అడిగింది  ఈడీ.  అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ విచారణ సమయంలో  కవిత పేరును ప్రస్తావించారు. దీంతో  కవితను  అరుణ్ రామచంద్రపిళ్లైతో  కలిపి  విచారించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios