Asianet News TeluguAsianet News Telugu

మాదాపూర్ లో ఫెరారీ కారు బీభత్సం.. వ్యక్తి మృతి

 ఆ మరణించిన వ్యక్తి పేరు యేసు బాబు గా పోలీసులు గుర్తించారు. అతను మాదాపూర్ లోని  ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.

Speeding Ferrari car kills pedestrian in Hyderabad; driver arrested nra
Author
Hyderabad, First Published Oct 12, 2020, 9:42 AM IST

మాదాపూర్ లో ఫెరారీ కారు భీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వేగంగా వేళ్లుతున్న ఫేర్రారి కార్ రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీ కొట్టింది.  కాగా.. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కాగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. చనిపోయిన వ్యక్తి  వయసు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

 ఆ మరణించిన వ్యక్తి పేరు యేసు బాబు గా పోలీసులు గుర్తించారు. అతను మాదాపూర్ లోని  ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. కాగా.. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కారు డ్రైవర్ నవీన్ కుమార్  అని.. అతనిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరగింది. ప్రమాదంలో చనిపోయిన  యేసు బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios