నిరుద్యోగులకు శుభవార్త
- త్వరలో డిఎస్సి నోటిఫికేషన్
- ఉప ముఖ్యమంత్రి కడియం ప్రకటన
- జిల్లాల పునర్విభవన వల్లే ఆలస్యమైందని వెల్లడి
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. జిల్లాల పునర్విభజన వల్లే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైందన్నారు. వచ్చే యేడాది పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వచ్చే యేడాది ఎద్ద ఎత్తున సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖను నెంబర్ వన్గా తీర్చి దిద్దాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కేజీ టు పీజీలో భాగంగా గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమైక్య పాలనలో భ్రష్టుపట్టిపోయిన విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు మరికొంత సమయం పడుతోందని తెలిపారు