Asianet News TeluguAsianet News Telugu

పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం :సిట్ కస్టడీకి ప్రవీణ్, రాజశేఖర్.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తరలింపు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను శనివారం చంచల్‌గూడ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అనంతరం వీరిని టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తరలించిన అధికారులు.. కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి ఇద్దరిని తీసుకెళ్లారు.

sit officials take custody to praveen and rajasekhar in paper leak case
Author
First Published Mar 18, 2023, 3:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను శనివారం చంచల్‌గూడ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం వీరిని టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తరలించిన అధికారులు.. కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి ఇద్దరిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కంప్యూటర్లను హ్యాక్ చేసి సమాచారాన్ని డొంగిలించినట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే టెక్నికల్ విషయాలపైనా సిట్ ఆరా తీసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే పేపర్ లీక్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్, రాజశేఖర్, రేణుకల నుంచి సిట్ అధికారులు మరింత సమాచారం సేకరించనున్నారు. ఇందుకోసం వారిని వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు.. చెబుతున్న విషయాలను సరిపోల్చనున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్‌లొ భాగంగా.. వారి మొబైల్ ఫోన్స్‌కు సంబంధించిన డేటాను కూడా విశ్లేషించనున్నారు. అలాగే పేపర్ లీక్‌కు సంబంధించి మిగిలిన నిందితుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌కు ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వం మహిస్తున్న సంగతి తెలిసిందే.

ALso REad: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్..

ఇక, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు గత అక్టోబరు నుంచే పలు పరీక్షలకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగిలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసినట్టుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదని అధికారులు నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే నిందితులు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదిక‌తో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios