మంచిర్యాల.. ఇసుక మాఫియా.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి
మాఫియా వేగం.. ఒకరు బలి
తెలంగాణలో ఇసుక మాఫియా మరణాలు ఇంకా తగ్గడంలేదు. ఇసుక లారీలు మెరుపు వేగంతో ప్రయాణిస్తూ జనాలను భయపెడుతున్నాయి. జనాలను ఇసుక మాఫియా రకరకాల కోణాల్లో బలితీసుకుంటున్నది.
తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నుర్ బతుకమ్మ వాగు వద్ద జాతియ రహదారి పైన ఇసుక లారి ఒకరిని బలితీసుకుంది. గడ్డి తో వెల్తున్న ట్రాక్తర్ ను ఇసుక లారీ వేగంగా వచ్చి వెనుక నుండి ఢీ కొట్టడంతొ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.