Asianet News TeluguAsianet News Telugu

శుభకార్యానికి వెళ్లివస్తుండగా ప్రమాదం....40మందికి తీవ్ర గాయాలు

కొద్దిగంటల ముందే వారంతా అంగరంగ వైభవంగాపెళ్ళి వేడుకల్లో ఆనందంగా గడిపారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి పూర్తయిన తర్వాత స్వస్ధలానికి బయలుదేరిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అర్థరాత్రి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చిన్నారులతో పాటు 30 మంది వరకు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.  
 

road accident at medak district
Author
Narayankhed, First Published Apr 5, 2019, 4:04 PM IST

కొద్దిగంటల ముందే వారంతా అంగరంగ వైభవంగాపెళ్ళి వేడుకల్లో ఆనందంగా గడిపారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి పూర్తయిన తర్వాత స్వస్ధలానికి బయలుదేరిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అర్థరాత్రి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చిన్నారులతో పాటు 30 మంది వరకు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.  

ఈ దుర్ఘటన అకోలా-హైదరాబాద్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని నాగల్ గిద్ద కు చెందిన ఇస్మాయిల్ అనే యువకుడి పెళ్లి గురువారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. స్వగ్రామం నుండి పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా కలిసి ఓ బస్సులో పెళ్లికి  వెళ్లారు. 

వివాహం అనంతరం వీరంతా మళ్లీ అదే బస్సులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌ గ్రామ శివారులో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న పెళ్లిబృందం బస్సు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని స్ధానికుల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని జోగిపేట, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు...అందులో పదిమంది చిన్నారులు వున్నట్లు సమాచారం. 

అనంతరం ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాధానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో వున్నాడని...అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios