Asianet News TeluguAsianet News Telugu

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆటోను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి

మరో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం...

road accident at jogulamba gadwal district

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో ను ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఉండవల్లి మండలం ఆలంపూర్ లో కూడలి వద్ద ఓ షేరింగ్ ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చయేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 
 

Follow Us:
Download App:
  • android
  • ios