చిట్ఫండ్ ఆఫీస్లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
హైద్రాబాద్ తుకారాం గేట్లోని ఓ ప్రైవేట్ చిట్ఫండ్ కార్యాలయంలో రిటైర్డ్ రైల్వే ఉద్యొగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్ ఫండ్ కార్యాలయ సిబ్బంది వేధింపుల కారణంగానే నాగన్న ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ తుకారాం గేట్లోని ఓ ప్రైవేట్ చిట్ఫండ్ కార్యాలయంలో రిటైర్డ్ రైల్వే ఉద్యొగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్ ఫండ్ కార్యాలయ సిబ్బంది వేధింపుల కారణంగానే నాగన్న ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తుకారాం గేట్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ చిట్ఫండ్ నుండి చిట్స్కు నాగన్న అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నాగన్న ష్యూరిటీ ఇచ్చాడు. అయితే ఈ విషయమై ప్రైవేట్ చిట్ఫండ్ కార్యాలయ సిబ్బంది వేధింపులకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ వేధింపులు భరించలేక సోమవారం నాడు నాగన్న కార్యాలయంలోనే శనివారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగన్న సోమవారం నాడు మృతి చెందాడు.
ఈ ఘటనపై నాగన్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చిట్ఫండ్ కార్యాలయంలో సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు చిట్ఫండ్ మేనేజర్లను అరెస్ట్ చేశారు.