Asianet News TeluguAsianet News Telugu

కుమార్తెపై అత్యాచారం.. గర్భందాల్చడంతో అబార్షన్.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష...

 ఆమె గర్భం దాల్చడంతో ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలి సహాయంతో ఏడు నెలల పిండం తొలగించాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో, 2014 జులై 9న మోర్తాడ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్లం కింద కేసులు నమోదు చేశారు. గర్భస్రావానికి సహకరించిన వైద్యురాలి పేరునూ కేసులో చేర్చారు.

Rape of daughter, Father sentenced to 20 years in prison in nizamabad
Author
Hyderabad, First Published Jan 1, 2022, 8:32 AM IST

నిజామాబాద్ : కుమార్తెపై (15) అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక Pocso Court తీర్పునిచ్చింది. నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తాగిన మైకంలో కుమార్తె మీద molestationకి పాల్పడ్డాడు. 

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆమె pregnant దాల్చడంతో ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలి సహాయంతో ఏడు నెలల పిండం తొలగించాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో, 2014 జులై 9న మోర్తాడ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్లం కింద కేసులు నమోదు చేశారు. గర్భస్రావానికి సహకరించిన వైద్యురాలి పేరునూ కేసులో చేర్చారు. 

కొంతకాలానికి ఆమె covid 19 సోకి మరణించారు. పోలీసుల తరఫున జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పంచాక్షరి నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష రూ.5వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లిచకుంటే మరో ఆరునెలల జైలుశిక్ష అనుభవించాలన్నారు. బాధితురాలు న్యాయసేవా సంస్థను ఆశ్రయించి రూ.4 లక్షల పరిహారం పొందాలని తీర్పులో పేర్కొన్నారు. 

Telanganaలో ఏరులై పారుతోన్న మద్యం.. రికార్డు స్థాయిలో liquor అమ్మ‌కాలు

ఇదిలా ఉండగా,  నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబంలో సంరక్షకుడే ఆ ఇద్దరు చిన్నారుల పాలిట కీచకుడయ్యాడు.  ఐదు నెలలుగా వారిపై అత్యాచారం చేస్తున్నా ఏం జరుగుతుందో తెలియని పసి హృదయాలు.. బైటికి చెప్పుకోలేకపోయాయి. ఈ హృదయవిదారక సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని Nizamabadజిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమార్తె, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు మనవరాళ్లతో రెండేళ్లుగా పెంటపాడులో ఉంటుంది. 

Thadepalligudem తాళ్లముదునూరుపాడుకు చెందిన ఉసుమర్తి పవన్ కుమార్ (30) వారితో పాటే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ కుమార్తె ఐదు నెలల కిందట జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ కు  వెళ్లగా బాలికలు అమ్మమ్మ, పవన్ కుమార్ సంరక్షణలో ఉంటున్నారు.

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 311 మందికి పాజిటివ్, ఒక్క హైదరాబాద్‌లోనే 198 కేసులు

రెండు రోజుల కిందట ఆ చిన్నారులు ఇద్దరూ పొత్తి కడుపులో నొప్పిగా ఉంటోందని  అమ్మమ్మకు  చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించింది. ఆ చిన్నారులిద్దరూ తమకు ఏం జరిగిందో.. విషయాన్ని అమ్మమ్మకు తెలిపారు. అది విన్న అమ్మమ్మ తట్టుకోలేకపోయింది. వెంటనే బుధవారం రాత్రి పెంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదయ్యింది. గురువారం ఏలూరు పోలీస్స్టేషన్ డిఎస్పి కేవీ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్ బాధితులను కలిసి వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించారు. నివేదిక రావల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios