Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 311 మందికి పాజిటివ్, ఒక్క హైదరాబాద్‌లోనే 198 కేసులు

తెలంగాణ (Telangana)లో కొత్తగా 280 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోలేదు. 206 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,563 యాక్టివ్‌ కేసులు వున్నాయి

311 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Dec 31, 2021, 10:50 PM IST

తెలంగాణలో (Telangana) కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 36,759 మంది శాంపిల్స్ పరీక్షించగా, 311 కొత్త కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 198 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 222 మంది కరోనా నుంచి కోలుకోగా, (corona deaths in telangana) ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,81,898కి చేరుకుంది. 6,74,221 మంది రికవరి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 3,650 యాక్టీవ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి కరోనా బారినపడిన పడి మరణించిన వారి సంఖ్య 4,027కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 198, జగిత్యాల 2, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 3, ఖమ్మం 2, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 3, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 32, ములుగు 0, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 2, సిరిసిల్ల 0, రంగారెడ్డి 28, సిద్దిపేట 5, సంగారెడ్డి 4, సూర్యాపేట 3, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 0, హనుమకొండ 9, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios