Asianet News TeluguAsianet News Telugu

రంజాన్ పండుగ: ముస్లిం ఉద్యోగుల పని వేళలను త‌గ్గించిన తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల పనివేళలు తగ్గించింది. ముస్లింలు ప్రార్థ‌న‌లు చేసుకోవ‌డానికి అనుగుణంగా స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయ‌ని అధికారులు తెలిపారు.
 

Ramzan : Telangana govt reduces working hours of Muslim employees
Author
First Published Mar 20, 2023, 7:24 PM IST

Telangana govt reduces work hours for Muslim: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల పనివేళలు తగ్గించింది. ముస్లింలు ప్రార్థ‌న‌లు చేసుకోవ‌డానికి అనుగుణంగా స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయ‌ని అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు/ కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్/ బోర్డులు/ ప్రభుత్వ రంగ ఉద్యోగులు ప్రార్థనలు చేసుకునేందుకు గంట ముందుగానే కార్యాలయాలు/ పాఠశాలల నుంచి బయటకు రావడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. పవిత్ర రంజాన్ మాసంలో సాయంత్రం 4 గంటలకు తమ కార్యాలయాలు/పాఠశాలల నుంచి బయటకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అనుమతినిచ్చింది.

టీఎస్–ఎంఎస్ సెంట్రల్ అసోసియేషన్-హైదరాబాద్ చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios