హైద్రాబాద్లో నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం: వైద్యం అందక శిశువు మృతి
హైద్రాబాద్ జవహర్ నగర్లో రోడ్డుపైనే ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యం అందక పుట్టిన శిశువు మరణించాడు. నడిరోడ్డుపైనే ఉన్న బాలింతను స్థానికులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ జవహర్ నగర్లో రోడ్డుపైనే ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యం అందక పుట్టిన శిశువు మరణించాడు. నడిరోడ్డుపైనే ఉన్న బాలింతను స్థానికులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైద్రాబాద్ జవహర్ నగర్ లో ఓ గర్భిణీ ప్రసవం కోసం సోమవారం నాడు వెళ్లింది. అయితే వైద్యులు లేకపోవడంతో ఆమె తిరిగి వస్తుండగానే నడిరోడ్డుపైనే ప్రసవించింది. మగ పిల్లాడికి ఆమె జన్మనిచ్చింది.
సకాలంలో వైద్యం అందని కారణంగా ఆ బాలుడు మరణించాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చేవరకు బాలుడు చనిపోయినట్టుగా 108 సిబ్బంది తెలిపారు.
నడిరోడ్డుపై స్పృహ లేకుండా ఉన్న బాలింతను 108 సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు.