మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విలక్షణమైన నేత. వాతావరణం  ఎంత సీరియస్ గా ఉన్నా ఆయన ఒక్క జోక్ పేలిస్తే చాలు అంతటా నవ్వులు పూస్తాయి. సీరియస్ అంశాలను సైతం ఆయన తన వాక్చాతుర్యంతో సదరా వ్యాఖ్యలతో ఆహ్లాదంగా మార్చగల నేర్పరి.

మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విలక్షణమైన నేత. వాతావరణం ఎంత సీరియస్ గా ఉన్నా ఆయన ఒక్క జోక్ పేలిస్తే చాలు అంతటా నవ్వులు పూస్తాయి. సీరియస్ అంశాలను సైతం ఆయన తన వాక్చాతుర్యంతో సదరా వ్యాఖ్యలతో ఆహ్లాదంగా మార్చగల నేర్పరి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పొన్నాల లక్ష్మయ్య సోమవారం తాజాగా కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అనారోగ్యంతో కేర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న పద్మశ్రీ దర్పల్లి రామయ్య (వన జీవి రామయ్య) ను పరామర్శించారు. ఈ సందర్బంగా 2005 లో రామయ్యకు ప్రభుత్వం తరపున వన మిత్ర అవార్డ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పొన్నాల. రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పొన్నాల పరామర్శిస్తున్న సమయంలో రామయ్య కుటుంబ సభ్యురాలు కంటతడి పెట్టుకొని రోధిస్తోంది. కానీ పొన్నాల మాటలు విన్న తర్వాత ఆమె నవ్వుతూ కనిపించింది. దీంతో చూశారా ఆమె ఎలా నవ్వుతుందో అంటూ పొన్నాల చమత్కరించడంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. దటీజ్ పొన్నాల.