శిల్పా చౌదరి కేసులో కీలక విషయాలు:లగ్జరీ లైఫ్, ర్యాంప్ వాక్
శిల్పా చౌదరి కేసులో నార్సింగి పోలీసులు కీలక విషయాలను కనుగొన్నారు.కిట్టీ పార్టీల పేరుతో వసూలు చేసిన డబ్బులతో శిల్పా చౌదరి లగ్జరీ లైఫ్ ఎంజాయి చేసిందని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖుల నుండి కోట్లను కొల్లగొట్టిన శిల్పా చౌదరి నుండి కీలక విషయాలను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి తీసుకొన్న డబ్బులతో shilpa chowdaryలగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేసిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కిట్టీ పార్టీలను పేరుతో ప్రముఖులను ఆహ్వానించి వారితో పెంచుకొన్న పరిచయంతో డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. శిల్పా చౌదరి దివినోస్ క్లబ్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లబ్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను కూడా ఆహ్వానించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా శిల్పా చౌదరి ramp walk నిర్వహించారు.శిల్పా చౌదరి లగ్జరీ లైఫ్ గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు కోకాపేటలోని యాక్సిస్ బ్యాంకులో శిల్పా చౌదరికి ఉన్న లాకర్ ను పోలీసులు తెరిచారు. శిల్పా చౌదరితో పాటు ఆమె బర్తను కూడా పోలీసులు యాక్సెస్ బ్యాంకుకు పిలిపించి లాకర్లను తెరిపించారు.
also read:శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు: బ్యాంకు లాకర్లు తెరిచే చాన్స్
kitty నార్టీల పేరుతో పలువురిని మోసం చేసినట్టుగా శిల్పా చౌదరిపై కేసులు నమోదయ్యాయి. సినీ నటుల కుటుంబాలతో పాటు పోలీస్ అధికారులు, వీఐపీలను లక్ష్యంగా చేసుకొని శిల్పా చౌదరి డబ్బులను వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన శిల్పా చౌదరిని గత వారంలో మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. అయితే పోలీస్ కస్డడీలో ఆమె నోరు విప్పలేదు. అంతేకాదు శని, ఆదివారాలు కూడా కావడంతో బ్యాంకు లావాదేవీలను తెలుసుకొనే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇవాళ ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి పోలీసులకు చుక్కలు చూపించింది. ఎన్నారై ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో తెలిపిందని సమాచారం.శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని చెప్పారని తెలుస్తోంది.
పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు.మరో వైపు తనకు డబ్బులు ఇచ్చిన వారు తనకు డబ్బులు తిరిగి ఇస్తే బాధితులకు డబ్బులు ఇస్తామని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.శిల్పా చౌదరి పలువురు సినీ హీరోల కుటుంబాలను కూడా మోసం చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.