యాదాద్రి  ఆలయాన్ని  అనుమతి లేకుండా  డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న  ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని అనుమతి లేకుండా డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

యాదాద్రి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా ఆలయం వద్దకు చేరుకున్న పోలీస్ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ జీడిమెట్లకు చెందిన సాయికిరణ్, జాన్ లు డ్రోన్ ద్వారా యాదాద్రి ఆలయాన్ని చిత్రీకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా యాదాద్రి ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడంపై పోలీసులు యువకులను ప్రశ్నిస్తున్నారు.