Hyderabad: న‌ల్గొండ‌లోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల  ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడంపై కేసీఆర్ కుమార్తె కవిత స్పందిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  

TRS legislator K. Kavitha: తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వెంటే ఉన్నారని మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తెలియజేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యురాలు, కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత అన్నారు. టీఆర్‌ఎస్‌ విజయం పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న అఖండ ప్రజాభిమానాన్ని ప్రతిబింబిస్తోందని ఆమె అన్నారు.న‌ల్గొండ‌లోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడంపై కేసీఆర్ కుమార్తె కవిత స్పందిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Scroll to load tweet…

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని ఓ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కవిత విలేకరులతో పై వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్‌ఎస్‌కు మునుగోడు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చౌకబారు రాజకీయాలకు పాల్పడి, విచ్చలవిడిగా ఆరోపణలు చేసిన బీజేపీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని కవిత అన్నారు. మునుగోడులో విజయం నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమని ఆమె పేర్కొన్నారు. గతంలో హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయంలో రూ.50 లక్షలతో రథం ఏర్పాటు చేస్తానని కవిత ప్రకటించారు.

Scroll to load tweet…

కాగా, అంత‌కుముందు మునుగోడు ఉప ఎన్నిక‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మునుగోడు ప్రజలు అభివృద్దికి, ఆత్మ గౌరవానికి పట్టంగట్టారని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. ఈ గెలుపు కోసం పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, గులాబీ దండుకు నమస్కారాలు తెలియజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వామపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. నల్గొండ గడ్డ మీద 12 సీట్లుకు 12 సీట్లు కట్టబెట్టినందుకు అక్కడి ప్రజలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయని రుజువైందన్నారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు.