Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ స్పీకర్ కు పిసిసి ఉత్తమ్ చురక

ఇప్పటికైనా స్పందించండి

pcc chief uttam fire on telangana speaker

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చురకలు వేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన కేసును హైకోర్టు తిసర్కరించిన నేపథ్యంలో ఉత్తమ్ మీడియాకు మెసేజ్ పంపారు.

హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. న్యాయం గెలిచింది. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నము. కాంగ్రెస్ పార్టీ కి న్యాయస్థానం, వ్యవస్థలపైన సంపూర్ణ విశ్వసం ఉంది.

ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పులను గౌరవించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల ఎమ్యెల్యే పదవులను పునరుద్ధరించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios