ఒకరిని కాపాడబోయి, మరొకరు చెరువులో దూకి, నీటిలో మునిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో సోమవారం జరిగింది.

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో బాలుడు కూడా నీట మునిగి గల్లంతయ్యాడు. ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఫిరంగి చంద్రయ్య తన భార్య లక్ష్మి, కూతురు లావణ్య (18)తో కలిసి నివసిస్తున్నారు. అయితే ఈ కుటుంబం ఆదివారం తమ ఇంట్లో బోనాల పండగ నిర్వహించింది.

మద్యానికి బానిసై , బాధ్యతలు గాలికొదిలేసిన కుమారుడు.. సుపారీ ఇచ్చి, హతమార్చిన తల్లిదండ్రులు

ఈ వేడుక కోసం చంద్రయ్య తన ఇద్దరు బావమరుదులను కుటుంబంతో కలిసి రావాలని ఆహ్వానించారు. దీంతో సిద్దిపేటలోని వర్గల్‌ మండలం అంబర్‌పేటలో నివాసం ఉండే ఓ బావమరిది దొడ్డు యాదగిరి తన భార్య బాలమణి (35), కుమారుడు చరణ్ (10), అలాగే మరో బావమరది శ్రీకాంత్, తన భార్య లక్ష్మి (30) తో కలిసి రంగాయపల్లికి వచ్చారు. ఆదివారం సంతోషంగా బోనాల పండగ నిర్వహించుకున్నారు. మరుసటి రోజు బట్టలు ఉతికేందుకు చంద్రయ్య భార్య లక్ష్మి తన కూతురు లావణ్య, తన సోదరుల భార్యలు బాలమణి, లక్ష్మి, అలాగే చరణ్ లు కలిసి చెరువు వద్దకు వెళ్లారు. 

అత్యాచారం చేసి.. కళ్లు పీకి.. జట్టు కత్తిరించి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య!

ఆ చెరువు గ్రామ శివారులో ఉంది. మహిళలు అంతా బట్టలు ఉతుకుంటుండగా.. చరణ్ నీటిలో దిగి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆ బాలుడు కాలు జారి నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. దీనిని తల్లి బాలమణి గమనించింది. వెంటనే అక్కడికి పరిగెత్తకుంటూ వచ్చి చెరువులో దూకి కుమారుడుని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె కూడా నీటిలో మునిగిపోయింది. వారిని కాపాడేందుకు వచ్చిన లక్ష్మి, లావణ్య కూడా నీటిలో మునిగారు. వీరందరినీ కాపాడేందుకు చంద్రయ్య భార్య లక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. కానీ ఆమె కూడా నీటిలో మునిగిపోతుండటంతో కేకలు వేసింది.

Delimitation: దక్షిణాది వాణి అణచాలని చూస్తే బలమైన ప్రజా ఉద్యమం తప్పదు: కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

దీంతో స్థానికులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమెను కాపాడి బయటకు తీశారు. కానీ ఆ నలుగురు నీటిలోనే మునిగిపోయారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఫిర్యంగి లావణ్య, దొడ్డు బాలమణి, దొడ్డు లక్ష్మి డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చారు. కానీ చరణ్ గల్లంతయ్యాడు. ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పండగ సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల రెండు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.