ఉద్యమ సమయంలో రాత్రి, పగలు కష్టపడి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ సాధించాం. అంత చేసినా నాకు పార్టీ న్యాయం చేయలేదు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. అసంతృప్తితో కొందరు, టికెట్ దక్కలేదని మరికొందరు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో సీనియర్ ఆ దిశగా అడుగులువేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆపార్టీ సీనియర్ నేత అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘దశాబ్ధకాలంగా పార్టీకి సేవ చేస్తున్నా.. ఎన్నో అవమానాలను భరించాను.. పిలిచి మాట్లాడే దిక్కే లేదు.. పాలిటిక్స్‌లో ఇన్ని ట్రిక్స్‌ ఉంటాయా.. అనిపించింది. నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌ పార్టీకి విధివిధానాలు లేవు. ఉద్యమ సమయంలో రాత్రి, పగలు కష్టపడి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ సాధించాం. అంత చేసినా నాకు పార్టీ న్యాయం చేయలేదు. కార్యకర్తల పరిస్థితి అదేవిధంగా ఉంది. పార్టీలో అన్యాయం, దోపిడీ జరుగుతోంది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

తన మద్దతుదారులతో సంప్రదించి.. వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.