నగర వాసులకు శుభవార్త. నగరానికి వర్షం ముప్పు తగ్గనుంది. రేపటి నుండి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్టుగా హైద్రాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త. నగరానికి వర్షం ముప్పు తగ్గనుంది. రేపటి నుండి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్టుగా హైద్రాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:వారంలోనే హైద్రాబాద్‌లో 700 మి.మీ. వర్షం: రజత్‌కుమార్

వచ్చే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 22 వ తేదీ నుండి హైద్రాబాద్ లో వర్షాలు తగ్గు ముఖం పట్టనున్నట్టుగా హైద్రాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

also read:హైద్రాబాద్‌‌లో భారీ వర్షాలు, కూలిన గోల్కోండ గోడ: పురాతన కట్టడాలకు దెబ్బేనా?

ఈ నెల 13వ తేదీన రాత్రి హైద్రాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. వారం రోజులుగా నగర వాసులను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నెల 17వ తేదీన కురిసిన వర్షం కూడ నగరాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.