Asianet News TeluguAsianet News Telugu

గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల ఘటనపై 9 టీములతో దర్యాప్తు: సీపీ రవీందర్

మక్సూద్ కు చెందిన ఇద్దరు కొడుకులతో పాటు, మరో ఇద్దరు బీహార్ యువకులు ఎక్కడికి వెళ్లారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నామని వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు.

nine teams inquiry on gorrekunta incident says warangal cp ravinder
Author
Warangal, First Published May 22, 2020, 1:05 PM IST

వరంగల్: గొర్రెకుంట బావిలో తొమ్మిది మంది మృతిపై దర్యాప్తు చేస్తున్నామని  వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు.శుక్రవారం నాడు గొర్రెకుంట బావి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన ఎలా చోటు చేసుకొందనే విషయమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఈ కేసు విచారణకు గాను పలు టీమ్ లు విచారణ చేస్తున్నామన్నారు.  గొర్రెకుంట బావిలో 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపామని సీపీ రవీందర్ తెలిపారు.

also read:హత్యలా, ఆత్మహత్యనా: వరంగల్‌లో బావిలో శవాలుగా తేలిన తొమ్మిది మంది వలస కూలీలు

ఈ ఘటనపై విచారణకు 9 మంది టీమ్ లను ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులతో ఐదు టీమ్‌లను, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో మరో నాలుగు టీమ్‌లను పోలీసులు  ఏర్పాటు చేశారు. ఈ 9 టీమ్ లు దర్యాప్తును వేగవంతం చేసినట్టుగా సీపీ రవీందర్ తెలిపారు.

గొర్రెకుంట బావిలో గురువారం నాడు రాత్రి నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ ఐదు మృతదేహాలు దొరికాయి. మొత్తం 9 మంది మృతి ప్రస్తుతం వరంగల్ లో సంచలనంగా మారింది. మృతుల బంధువులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. సంఘటన స్థలాన్ని వరంగల్ మేయర్ పరిశీలించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు  చేస్తున్నట్టుగా సీపీ తెలిపారు.

మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios