Asianet News TeluguAsianet News Telugu

ఆస్తి కోసమే కీర్తితో శశి ప్రేమాయణం, తల్లిపై ద్వేషం పెంచి... హత్యకు కుట్ర

హైదరాబాద్ హయత్‌నగర్‌లో తల్లిని చంపిన కీర్తి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తల్లిని చంపేలా కీర్తిని ప్రోత్సహించింది ఆమె ప్రియుడేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

new twist in hayat nagar murder case
Author
Hyderabad, First Published Oct 29, 2019, 10:20 AM IST

హైదరాబాద్ హయత్‌నగర్‌లో తల్లిని చంపిన కీర్తి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తల్లిని చంపేలా కీర్తిని ప్రోత్సహించింది ఆమె ప్రియుడేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఆస్తి కోసమే ఆమె ప్రియుడు శశి... కీర్తిని ప్రేమించాడని తమ ప్రేమకు ఆమె తల్లి రజిత అడ్డుగా ఉందని అతను కక్ష కట్టాడు.

ఇదే క్రమంలో తల్లిపై కీర్తికి లేనిపోని విషయాలను నూరిపోసి ద్వేషం ఏర్పడేలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది కీర్తి. 

Also Read:లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే...

తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న తల్లిని పొట్టన పెట్టుకున్న కీర్తిని పోలీసులు అరెస్టు చేసారు. ప్రియుడితో కలిసి తల్లి రజితను ఆమె చంపేసిన విషయం తెలిసిందే. హత్యను కప్పి పుచ్చేందుకు డ్రామాలు ఆడింది.

తల్లి రజిత కనిపించడం లేదని తండ్రితో కలిసి ఈ నెల 23వ తేదీన కీర్తి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కీర్తి, ఆమె ప్రియుడు కలిసి రజితను హత్య చేసినట్లు తేల్చారు. 

Also Read:ఇద్దరితో లవ్, శవం పక్కన ప్రియుడితో కలిసి..: తల్లిని చంపిన కీర్తి అరెస్టు

తల్లి రజితను కీర్తి ఈ నెల 19వ తేదీన హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని ప్రియుడితో కలిసి 21వ తేదీన తల్లి శవాన్ని రామన్నపేట రైల్వే ట్రాక్ పై పడేసినట్లు కీర్తి అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. 

రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి బ్రతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మునగనీర్ లో నివాసం ఉంటున్నారు. 

కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్వహారం నడిపిస్తున్న విషయాన్ని తల్లి రజిత (38) గుర్తించింది. కూతురు కీర్తిని తల్లి రజిత మందలించింది. దాంతో కక్ష పెంచుకుని ప్రియుడితో కలిసి హతమార్చింది. 

తండ్రి లారీ డ్రైవర్ గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి కీర్తి ఇంట్లో మూడు రోజుల పాటు గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. 

Also Read:ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో...

తాను విశాఖపట్నం పర్యటనకు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో కీర్తి గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios