Asianet News TeluguAsianet News Telugu

కొండా సురేఖ ఏమైనా సమంతను 'పండుకో' అన్నారా? : మహిళా న్యాయవాది సంచలనం

ఇప్పటికే అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వివాదం రేపగా... తాజాగా ఆమె లాయర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.  ఇంతకూ మంత్రి లాయర్ ఏమన్నారంటే.. 

Nagarjuna Defamation Case: Konda Surekha lawyer Comments Controversy Comments on Samantha and Akkineni Nagarjuna AKP
Author
First Published Oct 9, 2024, 12:05 PM IST | Last Updated Oct 9, 2024, 1:25 PM IST

Nagarjuna Defamation Case :  తెలుగు సినీ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పంచాయితీ నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేసే క్రమంలో హీరో నాగార్జున కుటుంబంపై సంచలన కామెంట్స్ చేసారు. దీంతో టాలీవుడ్ నటీనటులంతా  ఏకమై మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుడుతున్నారు... అంతేకాదు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.  

ఇలా కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సమయంలో ఆమె తరపు లాయర్ మరో వివాదానికి తెరతీసారు. హీరోయిన్ సమంత గురించిగాని... హీరోలు అక్కినేని నాగార్జున, నాగచైతన్య గురించి గానీ మంత్రి సురేఖ తప్పుగా ఏం మాట్లాడలేదని లాయర్ అన్నారు. అసలు మంత్రి ఎక్కడా అసభ్య పదజాలం ఉపయోగించలేరని అన్నారు. ఎక్కడ కూడా 'పడుకో'అనే పదమే మంత్రి ఉపయోగించలేరంటూ లాయర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

నాంపల్లి కోర్టుకు నాగార్జున :  

తన కుటుంబ పరువు తీసేలా మంత్రి కొండా సురేఖ మాట్లాడారంటూ  సినీ హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి  కోర్టును ఆశ్రయించారు. మంత్రిపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యాయి. న్యాయమూర్తి ముందు తన స్టేట్ మెంట్ ఇచ్చారు. 

ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసాయి నాగార్జున అన్నారు. సమాజంలో గౌరవంగా బ్రతుకున్న తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా వున్నాయన్నారు. అందువల్లే ఆమెపై పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున వివరించారు. 

కొండా సురేఖ లాయర్ కామెంట్స్

ఇలా నాగార్జున హాజరైన నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద మీడియా హడావిడి నెలకొంది. ఈ సమయంలోనే ఓ జర్నలిస్ట్ కొండా సురేఖ లాయర్ తో మాట్లాడారు. ఓ మహిళపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?  అంటూ మహిళా లాయర్ ను ప్రశ్నించగా విచిత్రంగా స్పందించారు.  అసలు కొండా సురేఖ తప్పుగా ఏం మాట్లాడలేదు... ఏమైనా పడుకోమని అన్నారా? ఇంకేమైనా అసభ్యకరంగా మాట్లాడారా? అంటూ సమంత గురించి మంత్రి సురేఖ మాటల్లో తప్పేమి లేదన్నారు లాయర్. 

సమంత పేరు వాడినందుకే కొండా సురేఖ క్షమాపణ చెప్పారు... అంతేకాదు తప్పు చేసినందుకు కాదని లాయర్ అన్నారు. సినిమా రంగం గురించి అందరికీ తెలుసు? హీరోలు, హీరోయిన్లు ఎలా వుంటారో తెలియంది కాదన్నారు. కానీ సినిమా వాళ్లంతా కలిసి స్టేట్ మెంట్లు ఇవ్వడమేంటో అర్థం కావడంలేదు అంటూ కొండా సురేఖ లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.  

కొండా సురేఖ, నాగార్జున మధ్య వివాదమేంటి? 

అక్కినేని నాగార్జున మంచి హీరోనే కాదు మంచి బిజినెస్ మెన్ అనే విషయం    అందరికీ తెలుసు. ఆయనకు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఇలా నాగార్జున కుటుంబానికి హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చేది. కానీ ఇది తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టారంటూ ఇటీవల హైడ్రా కూల్చివేసింది. అప్పటినుండి తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునకు మధ్య వివాదం సాగుతోంది. 

ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగారు.   ఈ క్రమంలోనే మాజీ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసారు మంత్రి కొండా సురేఖ.కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారని అన్నారు. ఎన్ కన్వెన్షన్ ను కాపాడుకునేందుకు మామ నాగార్జున, భర్త నాగచైతన్య లు సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లమన్నారని... అందుకు ఆమె అంగీకరించపోవడంతో విడాకులు ఇచ్చి ఇంట్లోంచి పంపించారని ఆరోపించారు. ఇలా మంత్రి కొండా సురేఖ సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios