Asianet News TeluguAsianet News Telugu

రూ. 3 వేలే ఇస్తారా?.. మునుగోడు ఇజ్జత్ తీస్తున్నారు: రాజకీయ పార్టీల తీరుపై ఓటర్ల అసంతృప్తి..!

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడగా.. గురువారం పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే పార్టీలు ఓటర్లను ప్రసన్నం  చేసుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
 

munugode bypoll Voters seems to be like disappointed over political parties cash distribution amount
Author
First Published Nov 2, 2022, 2:37 PM IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడగా.. గురువారం పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రస్తుతం ఎక్కడ చూసిన మునుగోడు ఉప ఎన్నిక గురించే చర్చ సాగుతుంది. మునుగోడులో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే చాలా మంది దీనిని ఖరీదైన ఉప ఎన్నిక అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల ఓటర్లు తమకు డబ్బు పంచడం లేదంటూ రాజకీయ  నాయకులను నిలదీస్తున్నారు.

ప్రచారానికి తెరపడటంతో.. మంగళవారం సాయంత్రం నుంచే పార్టీలు ఓటర్లను ప్రసన్నం  చేసుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని పార్టీలు నిన్న సాయంత్రం నుంచే పలుగ్రామాల్లో డబ్బులు పంపిణీ చేపట్టాయి. అయితే డబ్బు పంపిణీ విషయంలో పార్టీల వైఖరిపై మునుగోడు ఓటర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచే నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. దిగువ స్థాయి నేతలకు గాలం వేసిన పార్టీలు.. వేరే పార్టీలోని నేతలను తమ పార్టీలోకి వచ్చేలా వారికి భారీ మొత్తంలో చెల్లింపులు చేపట్టాయి. కొన్ని పార్టీలు.. ప్రచారానికి, సభలకు హాజరైనవారికి రోజుకు రూ. 500, భోజనం, కొందరికి మద్యం ఏర్పాటు చేశాయనే టాక్ ఉంది. దీంతో ఓటర్లు పోలింగ్ ముందు భారీగా నగదు పంపిణీ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది. 

గత కొద్ది  రోజులుగా తమ ఇళ్ల వద్దకు ప్రచారానికి వచ్చిన నేతలు.. ఓటుకు రూ. 30 వేలు లేదా తులం బంగారం అని చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం రూ. 3 వేల పంచుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లు  రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తున్నారు. మునుగోడులో కొన్నిచోట్ల మినహా.. మెజారిటీ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. ఇక, చాలా మంది ఓటర్లు పార్టీలు కనీసం రూ. 10 వేల చొప్పున పంపిణీ చేస్తాయని భావించారు. రెండు పార్టీల నుంచి డబ్బులు అందుకున్న రూ. 20 వేలు వస్తాయని ఆశపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు కనిపించకపోవడంతో రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: మాంసం ముక్క, మందు సుక్క, నోట్ల కట్ట.. మునుగోడు విజేతను నిర్ణయించేవి ఇవే!.. ఏషియానెట్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్..

రాజకీయ పార్టీలు కూడా తమకు పడే ఓట్లకు లెక్కలు వేసుకుంటూ డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో 2.4 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరికి డబ్బులు పంపిణీ చేయడం అంటే వందల కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఈ క్రమంలోనే బూతుల వారీగా తమకు ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారిని.. న్యూట్రల్‌గా ఉన్నట్టుగా కనిపించినవారిని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా వ్యుహాలు రచించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. 

చండూరులో వీక్‌గా కనబడుతున్న బీజేపీ.. అక్కడ రూ. 4 వేల వరకు పంపిణీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. తుఫ్రాన్‌పేట గ్రామంలో బీజేపీ ఓటర్లకు రూ. 10 వేలు ఇచ్చిందనే ప్రచారం విస్తృతం కావడంతో..  మిగిలిన ప్రాంతాల ఓటర్లు ఆ పార్టీ నేతలను తమకు రూ. 3 వేలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  కొయ్యలగూడెం, ఖైతాపురంలలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు రూ. 3 వేలు పంపిణీ చేశారనే టాక్ వినిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్‌, కమ్యూనిస్టులకు మద్దతుగా ఉన్నారని అనుకున్నవాళ్లకు బీజేపీ డబ్బులు పంపిణీ చేయడం లేదని మునుగోడులో టాక్ నడుస్తోంది. దీంతో వారు బీజేపీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  హుజురాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో అక్కడ ఓటుకు రూ. 6 వేలు ఇచ్చారని.. ఇక్కడ మాత్రం రూ. 3 వేలు ఇచ్చి మునుగోడు ఇజ్జత్ తీస్తున్నారని కొందరు ఓటర్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. చౌటుప్పల్ మండలంలోని  కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కూడా ఓటుకు వెయ్యి చొప్పున పంపిణీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. 

ఇక, మునుగోడు నియోజకవర్గంలో ఒకటి, రెండు చోట్లు.. తమకు డబ్బులు పంచడం లేదంటూ రాజకీయ నాయకుల ఇళ్లముందు ఓటర్లు ఆందోళన చెపట్టారు. దీన్నిబట్టే మునుగోడులో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా  ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మునుగోడులో చాలా చోట్లు  రూ. 20 వేల నగదు, తులం బంగారం ఏమైందనే ప్రశ్నే వినిపిస్తోంది. అయితే ఎంతో కొంత డబ్బులు తీసుకున్నప్పటికీ.. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారనేది మాత్రం తెలియదు. పార్టీలు తాము ఆశించిన స్థాయిలో డబ్బులు పంచడం లేదంటూ ఓటర్లు హార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో.. వారు ఎలాంటి  తీర్పున ఇస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios