Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: 15వ రౌండ్ లో కూసుకుంట్లదే హవా

మునుగోడు ఉప ఎన్నిక  కౌంటింగ్  లో  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డి తన  సమీప  బీజేపీ  అభ్యర్ది  కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డిపై  ఆధిక్యంలో  నిలిచారు.  

Munugode  bypoll  2022:TRS Candidate Kusukuntla Prabhakar Reddy Leads in 15 th Round
Author
First Published Nov 6, 2022, 6:06 PM IST

మునుగోడు:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో 15వ  రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆదిక్యంలో నిలిచారు. 

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ నుండి పన్నెండో రౌండ్  వరకు టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ  కేవలం  2,3 రౌండ్లలో మాత్రమే లీడ్ లో నిలిచింది. 15  రౌండ్ల  తర్వాత  టీఆర్ఎస్ అభ్యర్ధికి 97,006ఓట్లు, బీజేపీ అభ్యర్ధికి 86,697 ఓట్లు,  కాంగ్రెస్  అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  28,906 ఓట్లు దక్కాయి.10,309 ఓట్ల మెజారిటీతో  టీఆర్ఎస్  అభ్యర్ధి ఈ  స్థానంలో విజయం  సాధించారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios