Asianet News TeluguAsianet News Telugu

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి  స్పష్టం చేశారు.

mp konda vishweshwar reddy clarify the rumors over party change
Author
Hyderabad, First Published Nov 15, 2018, 4:47 PM IST

తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి  స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చేవెళ్ల లోకసభ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన కేసిఆర్ కు ఆయన చెప్పారు.

కేసీఆర్ తో భేటీ అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానని వచ్చిన వార్తలు వాస్తవాలన్నారు. కొద్ది సేపటి క్రితమే తాను ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలిశానన్నారు. కావాలనే రేవంత్ రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు

read more news

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

Follow Us:
Download App:
  • android
  • ios