Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ దామోదర్ రావు తల్లి మృతి.. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం..

బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ దివకొండ దామోదర్ రావు తల్లి కన్నమూశారు. ఆమె మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.

Mp Damodar Rao's mother passes away Former CM KCR expresses condolences..ISR
Author
First Published Mar 2, 2024, 3:59 PM IST

బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దివకొండ దామోదర్రావు తల్లి ఆండాలమ్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె మరణం పట్ల బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆండాలమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా..ఆండాళమ్మకు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, సంజయ్ కుమార్, కేశవరావు, సంతోష్ కుమార్ లు నివాళి అర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios