తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రా యాసలో అదరగొట్టాడు
నిరుద్యోగంపై ఎమ్మెల్యే సంపత్ వినూత్న నిరసన
అసెంబ్లీ అంటే ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం మామూలే. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఆ యుద్ధం కాస్త వెరైటీగా జరిగింది.
సోమవారం సభలో టీఎస్ఐపాస్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రా యాసలో మాట్లాడుతూ.. తాను ఏ కంపెనీకి వెళ్లినా ఆంధ్రా ఉద్యోగులే కనిపిస్తున్నారని ఆంధ్రా యాసలో చెప్పారు.
టీఎస్ ఐ పాస్ వల్ల నిరుద్యోగం ఏ మాత్రం తగ్గలేదన్నారు. ప్రతీ కంపెనీలో ఆంధ్రా వ్యక్తులే ఉంటే.. తెలంగాణ యువకులు ఏమైపోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.