Asianet News TeluguAsianet News Telugu

వారితో కలిసి భోజనం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోటలో పేదలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు

Minister satyavathi rathod Lunch with Sanitary Workers in mahabubabad
Author
Mahabubabad, First Published Apr 27, 2020, 4:43 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోటలో పేదలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్నిసాధించిన పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా సంబరాలు చేసుకోవాలని కానీ కరోనా కారణంగా వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నందున, ఈ మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు ఎవరి ఇంటి వద్ద వారు జెండా ఎగురేసి ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని కేసీఆర్ సూచించారని సత్యవతి అన్నారు.

లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండొద్దన్న సిఎం కేసిఆర్ పిలుపు మేరకు మానుకోటలో  సుమారు 500 మందికి సత్యవతి రాథోడ్ భోజనం ఏర్పాట్లు చేశారు.

Also Read:తెలంగాణలో కొత్తగా 11 మందికి పాజిటివ్, 1000కి చేరిన కేసులు: హైదరాబాద్‌లోనే అత్యధికం

వారికి స్వయంగా వడ్డించడంతో పాటు అనంతరం మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్, దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios