Asianet News TeluguAsianet News Telugu

సరస్వతి అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతు: విచారణకు మంత్రి ఆదేశం

బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం కావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

minister indrakaran reddy orders to inquiry on basara temple issue
Author
Hyderabad, First Published May 6, 2019, 4:01 PM IST


బాసర: బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం కావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి  ఆదేశించారు. బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతైన విషయమై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం నాడు  ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వజ్రం మాయమైన ఘటనపై బాధ్యులపైచర్యలు తీసుకోవాలని కూడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.బాసర ఆలయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు వివాదానికి కారణంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం


 

Follow Us:
Download App:
  • android
  • ios