Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20యేళ్ల జైలుశిక్ష..

ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఎల్బీ నగర్ కోర్టు 20యేళ్ల కఠిన కారాగాన శిక్ష విధించింది. 

Man gets 20-year rigorous imprisonment for raping 5-year-old in Hyderabad
Author
First Published Sep 30, 2022, 12:22 PM IST

హైదరాబాద్ : హైదరాబాద్ లోని మంచాల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఐదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఏడేళ్ల క్రితం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడేళ్ల తరువాత, ఎల్‌బి నగర్‌లోని స్థానిక కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి బుధవారం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

నిందితుడు తన ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని నిర్జన ప్రాంతానికి తీసుకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు దోషికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.

ఇదిలా ఉంటే, ఇలాంటి తీర్పే జూలైలో కొత్తగూడెం కోర్టు ఇచ్చింది. బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి సోమవారం తీర్పునిచ్చారు. కొత్తగూడెంకు చెందిన శ్రీనివాస్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు 2019 మే 7న స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిమీద దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 13 మంది సాక్షులను విచారించారు. ఆ తర్వాత శ్రీనివాస్ పై ఆరోపించిన నేరం రుజువైందని న్యాయస్థానం భావించింది. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బాలుడి కిడ్నాప్: గంట వ్యవధిలోనే కిడ్నాపర్ అరెస్ట్

దీంతో  శ్రీనివాస్ కి సెక్షన్  42 Pocso act ప్రకారం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా  లేదా జరిమానాకు బదులుగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 56 భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. మూడు వేల జరిమానా లేదా జరిమానా కింద రెండు నెలల కారాగారశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. 

ఇదిలా ఉండగా, జూలై 1న ఇలాంటి కేసులో నిందితుడికి త్రిపుర కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగున్నరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఎవరికైనా చెబుతుందనుకున్నాడో ఏమో హత్య చేశాడు. ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యక్తిని అరెస్టు చేశారు. త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు. 

ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే… అగర్తలలోని  ఖోవై జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడ తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్లు బాలిక నిరుడు ఫిబ్రవరిలో ఇంటిముందు ఆడుకుంటుంది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి.. కాసేపటికే కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలా తప్పిపోయిన చిన్నారి... ఆరు రోజుల తర్వాత  ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.

దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు, పోలీస్ స్టేషన్ లో వారి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కాళీ చరణ్ త్రిపురగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం... సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్ బిద్యేశ్వర్ సిన్హా తాజాగా నివేదికను, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించారు. విచారణ తర్వాత నిందితుడు దోషిగా నిర్ధారించిన కోర్టు మరణ శిక్ష విధించింది. ఖోవై జిల్లాలో మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios