Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ జిల్లాలో విషాదం: గేమ్ ఆడుతూ ఒకరి మృతి

వికారాబాద్  జిల్లాలోని ఓ రిసార్ట్స్  లో  నిర్వహించిన గేమ్ ఒకరి ప్రాణాలు  బలి తీసుకుంది.  బావిలో  పడేసిన  వస్తువును  బయటకు  తీయడమే  ఈ గేమ్  ఉద్దేశ్యం.

Man Dies After Playing  Game  At  Resorts  In  Vikarabad District
Author
First Published Oct 30, 2022, 11:36 AM IST

వికారాబాద్: జిల్లాలోని  ఓ రిసార్ట్స్ లో నిర్వహించిన గేమ్ కారణంగా ఒకరు  మృతి చెందారు. బావిలో  పడేసిన వస్తువును  తీసుకు రావడమే గేమ్  ఉద్దేశ్యం. అయితే  ఈ గేమ్ ఆడుతూ  ఓ  వ్యక్తి మృత్యువాత  పడినట్టుగా  ప్రముఖ  తెలుగు  న్యూస్  చానెల్  కథనం ప్రసారం చేసింది.

మూన్ లైట్ రిసార్ట్స్ లో అడ్వెంచర్ గేమ్ ను నిర్వహించారు. ఈ గేమ్ లో బావిలో వేసిన  వస్తువును బయటకు తీసుకురావాలి. ఈ గేమ్  లో పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్  సాయికుమార్ బావిలో పడిన వస్తువును తీసుకొచ్చేందుకు  బావిలోకి దిగి మృతి చెందాడు.ఈ ప్రాంతంలో సరైన వెలుగు లేకపోవడం కూడ సాయి కుమార్ మృతికి కారణంగా  ఈ గేమ్ లో పాల్గొన్నవారు చెబుతున్నారని ఆ కథనం తెలిపింది. బావిలో దిగిన సాయి కుమార్ ఎంతకీ బయటకు రాకపోవడంతో బావిలో వెతికితే సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. టెక్కీ మృతదేహన్నిపోస్టు మార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిసార్ట్స్ లో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios