Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. నమ్మించి, తీసుకెళ్లి మట్టుబెట్టారు...

తమ కిష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో జరిగింది. 

man brutally murdered by wifes family over love marriage in Hyderabad
Author
Hyderabad, First Published Jul 4, 2022, 10:08 AM IST

హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని.. యువతిని బంధువులు నమ్మించి తీసుకువెళ్లి హతమార్చారు. ఆ తరువాత మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాదులోని కేపీహెచ్బీ  కాలనీలో ఆరు రోజుల కిందట ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. శనివారం రాత్రి అతను సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో శవమై కనిపించాడు.  మృతుడి బంధువులు  తెలిపిన వివరాల ప్రకారం..  ప్రకాశం జిల్లా  కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీ పి.పొట్రెడ్డిపల్లెకి చెందిన శనివారపు బాలిరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు  నారాయణ రెడ్డి( 25).  

నారాయణరెడ్డి బీటెక్, హోటల్ మేనేజ్మెంట్ లు పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలోనే తమ దూరపు బంధువైన కందులవెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె రవళిని ప్రేమించాడు. వీరిద్దరూ ఏడాది క్రితం గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఈ పెళ్ళికి అమ్మాయి తరఫువారు ఇష్టపడకపోవడంతో... తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఆ తరువాత రవళి తండ్రి వెంకటేశ్వర్ రెడ్డి తన కుమార్తె తప్పిపోయిందటూ కొమరోలు పోలీస్స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదయింది. 

10 నెలల క్రితం కేసు పెట్టిన సమయంలో పోలీసులు నారాయణ రెడ్డి, రవళిని మార్కాపురం డిఎస్పీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అప్పుడు యువతి తల్లిదండ్రులు ఓ వారంలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని, తమ కూతురిని తమతో పంపించమని కోరారు. దీంతో రవళిని వారితో పంపించారు. ఆ తర్వాత ఎంత కాలానికి రిసెప్షన్ మాట ఎత్తలేదు. భార్యను తన దగ్గరికి పంపించలేదు. దీంతో నారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అది ప్రస్తుతం విచారణలో ఉంది.

తెలంగాణలో ఎజెండా మార్చిన బీజేపీ: అభివృద్ది మంత్రంతో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ఆ మాట లేకుండానే..

నారాయణ రెడ్డిని హత్యచేసి, తమ బిడ్డకు మరో పెళ్లి చేయాలని రవళి కుటుంబ సభ్యులు పథకం రచించారు. ఈ మేరకు అతనితో పరిచయమైన ఓ యువతి బంధువు శ్రీనివాసరెడ్డి గత నెల 27న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో మిత్రుడు అశోక్ తో కలిసి కేపీహెచ్బీలో ఉంటున్న నారాయణ రెడ్డి వద్దకు వెళ్లారు. విందు చేసుకుందాం అని కారులో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు.  నారాయణరెడ్డి మూడు రోజులుగా తిరిగి రాలేదని అతనితోపాటు గదిలో చంద్రశేఖర్ రెడ్డి గత నెల 30న కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజేందర్ నారాయణ రెడ్డితో పాటు అనుమానితుల ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి శనివారం రాత్రి ఆశిక్ ను పట్టుకున్నారు.

కారులోనే చంపేశారు.. అడవిలో తగులబెట్టేశారు..
జూన్ 27న రాత్రి శ్రీనివాస్ రెడ్డి కాశీ, అశోక్ నారాయణ రెడ్డిని కారులో ఎక్కించుకుని ఖాజాగూడా వైపు తీసుకువెళ్లారు. ఖాజాగూడలో మద్యం కొని, జిన్నారం వైపు వెళ్లారు. నారాయణ రెడ్డిని మార్గమధ్యంలో గొంతునులిమి చంపేశాడు. జిన్నారం శివార్లలోని అడవిలోకి మృతదేహాన్ని తీసుకువెళ్ళి పెట్రోల్ పోసి కాల్చేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. కాలేడాటా సాయంతో పోలీసులు ఆశిక్ ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సీఐ కిషన్ సిబ్బందితో శనివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కందుల వెంకటేశ్వర్ రెడ్డి,  ఇ అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డను అతని అత్తామామలే పథకం ప్రకారం హత్య చేయించారని నారాయణ రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్తను హత్య చేయించేందుకు తండ్రి పథకం రచిస్తున్నాడని రవళి బంధువులకు ఫోన్చేసి చెప్పిందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios