ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే.. కట్నం కోసం వేధించాడు.. చివరికి ఉరివేసి.. మెట్ పల్లిలో ఘటన
కట్నం డబ్బుల కోసం కట్టుకున్న భార్యను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మెట్ పెల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్నంగా జీవిస్తున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. అన్ని రోజులు భార్యను బాగా చూసుకున్న వ్యక్తే కట్నం కోసం వేధింపులు చేయడం ప్రారంభించాడు. భార్యను పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని తరచూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో పెద్దలు కలుగజేసుకొని పలుమార్లు అతడికి నచ్చజెప్పారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ తరువాత భార్యను వేధించడం మళ్లీ మొదలుపెట్టాడు. ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత భార్య మెడను తాడుతో గట్టిగా బిగించాడు. దీంతో ఆమె మృతి చెందింది. తరువాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయినా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అది ఆత్మహత్య కాదు హత్యా అని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
హైదరాబాద్ ట్యాంక్బండ్పై ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి..
ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్నం కోసం కడతేర్చాడో వ్యక్తి. కూతురు ప్రేమించిందని తనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. ఆ వ్యక్తి చేసిన పనికి పది నెలల కూతురుకు తల్లిలేకుండా పోయింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మెట్పల్లి మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ గ్రామానికి చెందిన కిశోర్, హన్విత (28) ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారి కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. 2018 సంవత్సరంలో వేదపండితులు సాక్షిగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు హన్విత తల్లిదండ్రులు 2 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే పెళ్లి సమయంలో ఒక లక్ష రూపాయిలు కట్నంగా ఇచ్చి, సంప్రదాయం ప్రకారం ఇతర వస్తువులు, లాంఛనాలు అందజేశారు.
దారుణం.. మతిస్థిమితం లేని దళిత బాలికపై ఏడునెలలుగా, ఏడుగురు అత్యాచారం..
అంత బాగానే సాగిపోతోంది. 10 నెలల క్రితం ఒక కూతురు కూడా జన్మించింది. కానీ కొన్ని నెలల నుంచి మిగితా లక్ష రూపాయిలు తీసుకురావాలని భార్య హన్వితపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు భర్త కిశోర్. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇది పెద్దల వరకు వెళ్లింది. ఈ నెల 21వ తేదీన వారిద్దరినీ కూర్చొబెట్టి నచ్చజెప్పారు. అన్యోన్నంగా జీవించాలని సూచించారు. కానీ భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. సోమవారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నా తరువాత భార్య మెడపై తాడుతో బిగించాడు. దీంతో ఊపిరాడక హన్విత మృతి చెందింది. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త కిశోర్.. హిన్విత మృతేదేహాన్ని కొక్కేనికి వేలాడదీశాడు. తెల్లారి హన్విత ఉరి వేసుకొందని ఇతర కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు కిశోర్ ను అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారణ జరపడంతో ఈ వ్యవహారం అంతా భయపడింది. ఈ ఘటనలో ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పది నెలల పాప తల్లి లేనిది కావడంతో ఆ గ్రామస్తులంతా కంటితడి పెట్టుకున్నారు.