Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. మతిస్థిమితం లేని దళిత బాలికపై ఏడునెలలుగా, ఏడుగురు అత్యాచారం..

మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని తాగిన మైకంలో గ్రామానికి చెందిన తోటి స్నేహితులతో పంచుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు కూడా ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఏడు నెలలుగా ఏడుగురు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. 

Sexual assault of an insane Dalit girl in nalgonda
Author
Hyderabad, First Published Dec 29, 2021, 10:17 AM IST

నల్గొండ : ఆ బాలిక mental condition బాగోలేదు. ఏ విషయాన్నీ ఎవ్వరితోనూ చెప్పుకోలేని పరిస్థితి ఆమెది. ఇదే అదనుగా భావించిన ఏడుగురు మృగాళ్లు ఆ బాలిక మీద ఏడు నెలలుగా Sexual assaultకి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన 
Nallagonda district మర్రిగూడ మండల కేంద్రం నుంచి చౌటుప్పల్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 

సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ దళిత దంపతులు Workersగా పనిచేస్తే జీవనోపాధి పొందుతున్నారు. వారికి మానసిక స్థితి సరిగాలేని ఓ కుమార్తె (16) ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన ప్రభుత్వ చిరుద్యోగి ఒకడు బాలిక ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ తరువాత మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని తాగిన మైకంలో గ్రామానికి చెందిన తోటి స్నేహితులతో పంచుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు కూడా ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఏడు నెలలుగా ఏడుగురు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఆ బాలిక ఆరోగ్యం క్షీణించి, నీరసిస్తుండడంతో.. ఈ పరిస్థితిని గమనించిన తల్లి స్థానిక వైద్యుడు వద్దకు తీసుకువెళ్లింది.

ఆ బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని నిర్థారించాడు ఇది విని తల్లి షాక్ అయ్యింది. ఆ తరువాత కూతురితో ఇంటికి చేరుకుని.. మూడు రోజులుగా తల్లిదండ్రులు, మేనమామ, బంధువులు బాలికను రకరకాలుగా ప్రశ్నించారు. చివరికి బాలిక గ్రామానికి చెందిన ఏడుగురు తన మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని వివరించగలిగింది. 

దీంతో ఆమె కుటుంబ సభ్యులు నిందితులు ఏడుగురిని పట్టుకుని రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇందుకు తామేమీ బాధ్యులం కాదని ఆ ఏడుగురు చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాధిత బాలిక ఇంటివద్దనే ఉండగా, ఈ ఘటన మీద పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని చెబుతున్నారు. 

కల్లుతాగి 15 మందికి అస్వస్థత.. హాస్పిటల్ కు తరలింపు..

ఇలాంటి ఘటనే, రాజస్థాన్ లో సోమవారం చోటు చేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడో కామాంధుడు. ఇరుగు పొరుగు వారు గమనించడంతో ఆ చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడింది. 

వివరాల్లోకి వెళితే..  జైపూర్లోని ఒక కాలనీలో ఉండే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వారికి 9 ఏళ్ళ పాప ఉంది. ముగ్గురే ఉంటారు. అయితే ఆ రోజు స్కూలుకు holiday ఉండడంతో  పాప  ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. పాప తల్లి పక్కింటి ఆంటీకి పాపను కాస్త చూడమని అప్పజెప్పి, ఉద్యోగానికి వెళ్ళిపోయింది.

తల్లి వెళ్లిన కాసేపటికి పాప తాను బయట ఆడుకుంటానని ఆమెకు చెప్పి.. బైటికి వచ్చింది. అక్కడ ఆడుకుంటుంది. ఇది ఓ వ్యక్తి గమనించాడు.  అలా పాప బయట ఆడుకుంటున్న సమయంలో అదే కాలనీలో ఉండే ఒక అంకుల్ చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత  పాప పై అత్యాచారం చేయబోగా పాప భయపడి ఏడుస్తూ గట్టిగా అరిచింది,

పాప అరుపులకు సదరు ఆంటీ, ఇరుగుపొరుగువారు ఏమైందోనని పరుగు పరుగున వెళ్లి చూశారు. వారంతా రావడం చూసిన అంకుల్ పారిపోయాడు.  చిన్నారి వారికి అర్ధ నగ్నంగా కనిపించింది. దీంతో ఏమై ఉంటుందో వారు ఊహించారు. షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.  పోలీసులు  పోక్సో చట్టం కేసు నమోదు చేసుకుని  పరారీలో ఉన్న  నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios