Asianet News TeluguAsianet News Telugu

దావోస్ లో కేటిఆర్ స్వకార్యం.. స్వామి కార్యం

  • దావోస్ లో రెండు రోజు కేటిఆర్ బిజి
  • ప్రముఖులతో సెల్పీలు, బిజినెస్ మీటింగ్ లు
  • బాబుతో దిగిన సెల్ఫీ తెలుగు నేల మీద వైరల్
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న తెలంగాణవాదులు
KTR is busy with selfies and meetings in Davos

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజు బిజి బిజిగా గడిపారు తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్. అయితే అక్కడ ఆయన పర్యటన రెండు కోణాల్లో చూడొచ్చు. అందులో ఒకటి స్వకార్యం, స్వామి కార్యం అన్నట్లుగా వివిధ కంపెనీల అధినేతలతో భేటీ అవుతూనే చాన్స్ దొరికినప్పుడుల్లా ప్రముఖులతో సెల్పీలు దిగుతున్నారు. టిఆర్ఎస్ పుట్టక నుంచీ బద్ధశత్రువుగా భావించి ప్రచారం చేస్తూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబుతో కేటిఆర్ సెల్ఫీ దిగారు. అంతేకాదు ఆ సెల్పీని ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇక బాలివుడ్ అగ్ర నటుడు షారూఖ్ ఖాన్ తోనూ సెల్పీ దిగారు. ఇతర ప్రముఖులతోనూ సెల్పీలు దిగుతున్నారు. ఇటు మీటింగులు.. అటు సెల్ఫీల్లో బిజీ అయ్యారు కేటిఆర్.

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గోంటున్న తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో అయా కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వారికి వివరించారు.  ఉదయం ఏయిర్ ఏషియా గ్రూప్ సియివో అంతోనీ ఫెర్నాండెస్, ఉప కార్యనిర్వహానధికారిణి  ఏయిరీన్ ఒమర్ తో మంత్రి సమావేశం అయ్యారు.  దేశంలో రానున్న రోజుల్లో విమానయాన రంగం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. హైదరాబాద్లోని విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు.

నోవార్టిస్ కంపెనీ పబ్లిక్ పాలసీ హెడ్ పెట్రా లక్స్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మసిటీ గురించి వివరించారు. నగరం ఇప్పటికే భారతదేశ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా ఉన్నాదన్నారు. నొవార్టిస్ నగరంలో తమ కార్యకలాపాల విస్తరణపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది.  నోవార్టిస్ కు నగరంలో అర్ అండ్ డి సెంటర్, డాటా  సపోర్ట్ మరియు అనాలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, హైదరాబాద్ నగరంలో సంస్ధ అభివృద్ది పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని లక్స్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 90 వేల చదరపు అడుగుల ల్యాబోరేటరీని రెట్టింపు చేయనున్నట్లు, కొత్త సూమారు మరో 150 మంది  పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.  పూర్తి వివరాలను త్వరలోనే నోవార్టిస్ అందిస్తుందని, కంపెనీతో కార్యకలాపాల విస్తరణ ద్వారా నగరంలోని జినోమ్ వ్యాలీ అభివృద్దికి ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి కెటి రామారావు తెలిపారు.

మిత్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ కార్యనిర్వహాక ఉపాద్యక్షులు  కెన్ కవాయి బృందంతో సమావేశం అయ్యారు. తమ కంపెనీ భారీ ప్రాజెక్టుల కోసం చూస్తుందని మంత్రికి వారు తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులపైన మిత్సుబిషికి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులకు నిర్మాణానికి తమ రాష్ర్టంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా తెలంగాణలో పర్యటించాలని కోరారు. మిత్సుబిషి ముందుకు వచ్చి జపనీస్ స్మాల్ అండ్ మిడియం  ఎంటర్ ప్రైజేస్ పార్క్ ఎర్పాటు  చేయాలని కోరారు. మెన్నటి జపాన్ పర్యటనలో ఇలాంటి పార్కుకు జైకా వంటి అర్ధిక సంస్ధలు నిధులు అందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని మంత్రి తెలిపారు. 

కువైట్కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సియివోతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్పాదనలో అగ్రస్ధానంలో ఉందన్నారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి వివరించారు. రాష్ర్టంలో పవర్, మెడికల్ డివైజేస్ మాన్యూఫాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో సర్కూలర్ అవార్డు గెలుచుకున్న టిహబ్ సంస్ధ బనయన్ నేషన్ సహావ్యవస్ధాపకుడు మనివాజిపేయ్ మంత్రిని కలిసారు.

Follow Us:
Download App:
  • android
  • ios