ప్రతి కార్పొరేషన్ లో రెండు డైరెక్టర్ పోస్టులు ముస్లింలకే 20 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటన 500 లకు పైగా రెసిడెన్సియల్ స్కూల్స్ ఇచ్చామని వెల్లడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ సిఎం కెసిఆర్ ముస్లిం మైనార్టీలకు మరిన్ని వరాలు కురిపించారు. ఇప్పటికే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్ లో రెండు డైరెక్టర్ పోస్టులు మైనార్టీలకే ఇస్తామని ప్రకటించారు కెసిఆర్. 20 రోజుల్లోగా పకడ్బందీగా ఎజెండా రూపొందించి నివేదిక ఇవ్వండి అని మైనార్టీ ప్రముఖులకు సూచించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కూర్చుని చర్చించి నివేదిక అందించాలన్నారు. రాష్ట్రంలో మైనార్టీల కోసం 500 పైచిలుకు రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానికే ఉందన్నారు. 
అయితే అంతగా ప్రాచుర్యం పొందని ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుుతున్నది.