Asianet News TeluguAsianet News Telugu

కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల వివరాలు... స్వయంగా వెల్లడించిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన కుటుంబ(కల్వకుంట్ల) వ్యవసాయేత ఆస్తుల వివరాలను స్వయంగా వెల్లడించారు. 

KCR Family Assests Registered revenue department akp
Author
Erravalli, First Published Oct 11, 2020, 7:58 AM IST

సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వ్యవసాయేత ఆస్తుల వివరాల సేకరణ శరవేగంగా కొనసాగుతోంది. రెవెన్యూ సిబ్బంది ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన కుటుంబ(కల్వకుంట్ల) వ్యవసాయేత ఆస్తుల వివరాలను స్వయంగా వెల్లడించారు. 

మార్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామ శివారులోని సొంత ఫాంహౌజ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్థానిక వీఆర్వో సిద్దేశ్వర్ కలిశారు. ఈ క్రమంతో తన కుటుంబ ఆస్తుల వివరాలను స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించారని అతడు తెలిపాడు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబ వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సేకరించుకోవడంతో పాటు కేసీఆర్ ఫోటోలను సంంబంధిత యాప్ లో అప్ లోడ్ చేశారు. 

దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు వివరాలను సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది టీఆర్ఎస్ సర్కార్. ఇలా వ్యవసాయేతల ఆస్తులు కలిగిన ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. 

ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం పేర్కోన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు.

భూ వివాదాలు , ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు సిఎం చెప్పారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్ లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.  

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు,  వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్ లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని సిఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు.

ఇకముందు ఒక ఇంచు భూమి ఒకరి పేరు నుండి మరొకరి పేరుమీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని సిఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతి, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సిఎం ప్రజలను కోరారు.  

ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని హెచ్చరించారు. నిరుపేద ప్రజలు ఎన్నో ఏండ్లుగా వుంటున్న ఇండ్ల స్తలాలను పూర్తి స్తాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సిఎం ప్రకటించారు.

దీనివల్ల నిరుపేదల ఇంటి స్తలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు పేదలకు కలుగుతుందని సిఎం పేర్కోన్నారు.   ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్.ఆర్.ఎస్ కు ఏలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతిరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సిఎం వివరించారు.

వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో  నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తులను ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సిఎం తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంపిటీసిలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్తాయిలో సహకరించాలని సిఎం అన్నారు. ఎంపీఓలు దీన్ని పూర్తి స్తాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios