Asianet News TeluguAsianet News Telugu

మహంకాళీ బోనాలలో జోగిని శ్యామల కంటతడి.. కేసీఆర్ ప్రభుత్వానికి శాపనార్థాలు(వీడియో)


తెలంగాణ ప్రభుత్వంపై జోగిని శ్యామల మండిపడ్డారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తుల తాకిడికి సరిపడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

jogini syamala fires on telangana government

తెలంగాణ ప్రభుత్వంపై జోగిని శ్యామల మండిపడ్డారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తుల తాకిడికి సరిపడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు..

పోలీసులు వీఐపీల సేవలో తరిస్తున్నారని.. బోనం ఎత్తుకుని వెళ్లేవారికి కేటాయించిన క్యూలైన్లో సాధారణ భక్తులను పంపుతున్నారని.. ఒక్కొక్కరు 10 కిలోల బరువును తలపై పెట్టుకుని నిల్చున్నారని.. గొప్పగా ఏర్పాట్లు చేశామని చెబుతున్న ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని ఆమె కంటతడి పెట్టారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుందని ఆమె శ్యామల చెప్పారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios