టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో బుధవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బుధవారం నాడు హైదరాబాద్ లో ఓ సినీ నిర్మాత ఆఫీసులో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు చేపట్టారు. అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాతగా ఉన్నారు. రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Add Asianetnews Telugu as a Preferred Source

