Asianet News TeluguAsianet News Telugu

సజ్జనార్: నాడు వరంగల్‌లో, నేడు షాద్‌నగర్‌లో నిందితుల ఎన్‌కౌంటర్

: నాడు వరంగల్ లో, నేడు షాద్‌నగర్ లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు పోలీసులు బుద్ది చెప్పారు

IPS Sajjanar Special Encounters: In 2008 at Warangal, Now Shadnagar
Author
Hyderabad, First Published Dec 6, 2019, 8:03 AM IST

హైదరాబాద్: నాడు వరంగల్ లో, నేడు షాద్‌నగర్ లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు పోలీసులు బుద్ది చెప్పారు. నాడు, నేడు ఈ కేసులను పర్యవేక్షించిన పోలీసు ఉన్నతాధికారి వీసీ సజ్జనార్. వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందితులు నాడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు, దిశను హత్య చేసిన నిందితులు శుక్రవారం నాడు ఉదయం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి ఘటనలో ముగ్గురు ఎన్‌కౌంటర్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పెద్ద సంచలనమే అయింది. ఈ ఘటన చోటు చేసుకొన్న సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్‌ పనిచేస్తున్నారు.

Also read:దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత

 ఈ ఘటనను ఆనాడు కొందరు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దిశ హత్య ఘటనలో నిందితులు కూడ  పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతి చెందారు. ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్నారు. 

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువతులపై యాసిడ్ పెద్ద సంచలనం  కలిగింది. వరంగల్ లో నివాసం ఉంటున్న స్వప్నిక, ప్రణీతలు స్నేహితులు. స్వప్నిక ఇంటికి సమీపంలో ఉండే శ్రీనివాస్ ఆమెను నిత్యం వేధించేవాడు. స్వప్నిక మాత్రం శ్రీనివాస్ ఆమెను ప్రేమించాలని వేధింపులకు గురిచేశాడు.

అయితే స్నప్నిక మాత్రం శ్రీనివాస్ గురించి పట్టించుకోలేదు. కాలేజీని నుండి స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్వప్నిక స్కూటీపై ఇంటికి వస్తున్న సమయంలో  పట్టపగలే శ్రీనివాస్ స్వప్నికపై  యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.  ఈ ఘటన 2008 డిసెంబర్ 10వ తేదీన చోటు చేసుకొంది.

వరంగల్ లోని కిట్స్ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. స్వప్పిక వరంగల్ లో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత స్వప్నిక, ప్రణీతలను హైద్రాబాద్‌కు తరలించారు. హైద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  స్వప్నిక మృతి చెందింది. ప్రణీత మాత్రం ప్రాణాలతో బయటపడింది.

స్వప్నిక , ప్రణీలతపై యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్  వాళ్లకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్ తో పాటు అతని స్నేహితులు హరికృష్ణ, సంజయ్‌లు ఎన్‌కౌంటర్ లో మృతి చెందారు. శ్రీనివాస్ వద్ద ఆయుధాలు ఎలా వచ్చాయనే దర్యాప్తును పోలీసులు చేపట్టారు. ఆ సమయంలో ఆయుధాలు దాచిన స్థలాన్ని చూపిస్తామని పోలీసులను తీసుకెళ్లారు.

తాము దాచుకొన్న ఆయుధంలో తమపై దాడికి దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. స్వప్నిక, ప్రణీతలపై  దాడికి పాల్పడిన వారు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో  వరంగల్ జిల్లా ఎస్పీగా వీసీ సజ్జనార్ ఉన్నారు.

దివపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. ఈ నలుగురు నారాయణపేట జిల్లాకు చెందినవారు.దిశ హత్య చోటు చేసుకొన్న ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకొంది.దిశ ను సజీవ దహనం చేసిన చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జి కిందే పోలీసులు నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. 

వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

దిశ హత్య విషయం వెలుగు చూసిన సమయంలో మరోసారి సజ్జనార్ ఏం చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో జరిగింది.దిశను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. అయితే ఈ రెండు ఎన్ కౌంటర్ లు యాధృచ్ఛికమా... కావా అనే విషయం పక్కన పెడితే ఈ రెండు ఘటనల సమయంలో పోలీసు బాస్ గా సజ్జనార్ ఉన్నాడు. 

వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్ బృందాన్ని ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో కూడ ఈ ఎన్‌కౌంటర్ ను వ్యతిరేకించిన వారు కూడ లేకపోలేదు. సమర్ధించినవారు కూడా ఉన్నారు.

అప్పట్లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిన వెంటనే విద్యార్ధులు తమ భుజాలపై ఆనాటి ఎస్పీ సజ్జనార్‌ను ఎత్తుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన తర్వాత ఈ తరహా ఘటనలు ఆగలేదు. దీంతో ఎన్‌కౌంటర్లు సరికాదని వాదించేవారు కూడ లేకపోలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios