Asianet News TeluguAsianet News Telugu

ఓట్లు అడిగే ముందు మేడిగ‌డ్డ‌ను ఎందుకు ప‌రిశీలించ‌లేదో చెప్పండి: ప్రధాని మోడీకి రేవంత్ సూటి ప్ర‌శ్న

Telangana Assembly Elections 2023: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోని బ్లాక్ -7లో పిల్లర్లు కుంగిపోవ‌డం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు విమ‌ర్శ‌ల దాడులు చేస్తున్నాయి.  
 

Inspect Kaleshwaram Lift Irrigation Project before asking for votes: Revanth Reddy to PM Modi RMA
Author
First Published Nov 5, 2023, 4:55 AM IST

TPCC chief Revanth Reddy: తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కేఎల్ఐపీ)ని పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. మేడిగ‌డ్డ బ్యారేజీ పిల్ల‌ర్లు కుంగిపోతున్న విష‌యం తెలిసి కూడా ఎందుకు ప‌రిశీలించ‌లేదో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. ''ప్రధాని రాష్ట్రానికి చాలాసార్లు వ‌చ్చారు.. వ‌స్తూ ఓట్లు అడుగుతున్నారు, అయినా కాళేశ్వరాన్ని ఎందుకు పరిశీలించలేదు? మేడిగడ్డ పిల్ల‌ర్లు స్తంభాలు ఎందుకు మునిగిపోయాయో ప్రధాని కనుక్కోవాల‌న్నారు. ఈ ప్రాజెక్టుకు బాధ్యులైన వారందరినీ అరెస్టు చేయాలని'' డిమాండ్ చేశారు.

“అవినీతి పట్ల ఆయనకు (ప్రధాని మోడీ) అసహనం దృష్ట్యా, కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని రేవంత్ అన్నారు. ''కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? బీఆర్‌ఎస్ నుంచి రక్షణ కోసం బీజేపీకి డబ్బులు అందుతున్నాయా? వారు ఈ లోపభూయిష్ట ప్రాజెక్ట్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదో ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. మరి కాంట్రాక్టర్లపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?'' అని రేవంత్ అన్నారు. 2021లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని ఖ‌ర్చులు పెర‌గ‌డం గురించి  ప్ర‌శ్నించారు. అధికార బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడుతోందని రేవంత్ ఆరోపిస్తూ.. 'ఇరిగేషన్ శాఖను పర్యవేక్షిస్తున్న కేసీఆర్, హరీశ్ రావులు బాధ్యత వహించాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) నివేదికపై కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రతిస్పందనను కూడా మేము డిమాండ్ చేస్తున్నామని' తెలిపారు.

రీడిజైన్‌ ముసుగులో కేసీఆర్‌ ప్రాజెక్టుల డైనమిక్స్‌ని మార్చి వేల కోట్లు దుర్వినియోగం చేశారని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ ఆరోపించారు. ప్రాజెక్ట్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత నియంత్రణను విస్మరించారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ప్రణాళికాబద్ధంగా నిర్మించలేదనీ, దీని కార‌ణంగా ఇప్పుడు ప్రాజెక్టు పిల్ల‌ర్లు కుంగిపోతున్నాయ‌ని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదిలావుండ‌గా, 
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్ఏ) ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ బ్లాక్-7లో పూడిక తీతపై విచారణ జరిపిన తన నివేదికలో ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్‌ను తప్పుబట్టింది. ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత నియంత్రణ, ఆపరేషన్, నిర్వహణకు సంబంధించిన అంశాల‌తో ఈ సమస్య వ‌చ్చింద‌ని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios