Asianet News TeluguAsianet News Telugu

రాజ్ పుష్ప, ముప్పా సంస్థల్లో ముగిసిన ఐటీ సోదాలు: ఆరు రోజుల తనిఖీలు

రాజ్ పుష్ప, ముప్పా  సంస్థల్లో  ఐటీ సోదాలు  ఇవాళ ముగిశాయి.   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి  నివాసం, ఆయన  కార్యాలయాల్లో  కూడా  ఐటీ అధికారులు  సోదాలు  చేసిన విషయం తెలిసిందే.  

Income Tax raids  completed  on  BRS  MLC  Venkatram Reddy  Firms
Author
First Published Feb 6, 2023, 10:28 AM IST

హైదరాబాద్:  నగరంలోని   రాజ్ పుష్ప,  ముప్పాలలో   ఐటీ సోదాలు  సోమవారం నాడు ముగిశాయి.  ఆరు రోజుల పాటు  ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ రెండు సంస్థలతో  పాటు  వెర్టిక్స్,  వసుధ పార్మాలలో  కూడ  ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ రెండు  సంస్థల్లో   నాలుగు రోజుల పాటు  పాటు  సోదాలు జరిగాయి.  

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ   వెంకట్రామిరెడ్డి  ఇల్లు,  కార్యాలయాల్లో  కూడా  ఐటీ అధికారులు సోదాలు  చేశారు.   ఈ సంస్థల్లో  నిర్వహించిన సోదాల్లో  కీలకమైన డాక్యుమెంట్లను  ఆదాయ పన్ను శాఖాధికారులు  సీజ్  చేశారు.  ఈ డాక్యుమెంట్ల  ఆధారంగా  ఐటీ అధికారులు   విచారించినట్టుగా సమాచారం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios