Hyderabad: పంజాబ్ ముగ్గురు సభ్యుల బృందానికి బల్లోవాల్ సౌంఖ్రీలోని ప్రాంతీయ పరిశోధనా కేంద్రం (ఆర్ఆర్ఎస్) డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్ సింగ్ నేతృత్వం వహిస్తారు. సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు డాక్టర్ సంజయ్ సత్పుటే, డాక్టర్ అబ్రార్ యూసుఫ్ లు ఈ బృందంలో ఉన్నారు.
Punjab team to study Mission Kakatiya: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై అధ్యయనం చేయడానికి పంజాబ్ ప్రభుత్వ బృందం రాష్ట్రానికి రానుంది. తెలంగాణలో వినియోగిస్తున్న మిషన్ కాకతీయ చెరువులు, చెక్ డ్యాంలు, భూగర్భ జలాల రీచార్జి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రంలో పర్యటించనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బృందం ఈ నెల 28న హైదరాబాద్ చేరుకుని మార్చి 1, 2 తేదీల్లో మిషన్ కాకతీయ పరిధిలోని వివిధ జలాశయాలను సందర్శించనుంది.
పంజాబ్ ముగ్గురు సభ్యుల బృందానికి బల్లోవాల్ సౌంఖ్రీలోని ప్రాంతీయ పరిశోధనా కేంద్రం (ఆర్ఆర్ఎస్) డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్ సింగ్ నేతృత్వం వహిస్తారు. సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు డాక్టర్ సంజయ్ సత్పుటే, డాక్టర్ అబ్రార్ యూసుఫ్ లు ఈ బృందంలో ఉన్నారు. నీటి పారుదల శాఖ అభివృద్ధి చేసిన కృత్రిమ నీటి వనరుల రీచార్జ్ నిర్మాణాలను, గజ్వేల్ నియోజకవర్గంలోని పాండవుల చెరువు వివరాలను తెలుసుకునేందుకు ఫిబ్రవరి 16న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్, ఎర్రవల్లి వద్ద నిర్మించిన చెక్ డ్యాంలను సందర్శించి మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను ఈ బృందం పరిశీలించనుంది.
పంజాబ్ కు తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణలో మిషన్ కాకతీయ కార్యక్రమం, రాష్ట్రంలో బహుళ స్థాయి జలవనరుల అభివృద్ధి ఎలా జరిగిందో అధ్యయనం చేసి నివేదించాలని భగవంత్ మాన్ ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం అమలు ఫలితాలను అధ్యయనం చేసేందుకు త్రిసభ్య బృందం రాష్ట్రంలో పర్యటించనుందనీ, వీరి పర్యటనకు ఇరిగేషన్, భూగర్భ జల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
