Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ కోఠిలో రూ.70 లక్షలు సీజ్:ఐదుగురు అరెస్ట్

నగరంలోని  కోఠిలో  రూ.70 లక్షలను పోలీసులు  ఆదివారం నాడు సీజ్  చేశారు. ఈ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Hyderabad  Police seizes Rs 70 lakhs seizes at Koti
Author
First Published Oct 23, 2022, 4:15 PM IST

హైదరాబాద్: నగరంలోని కోఠిలో రూ. 70 లక్షలను  ఆదివారం నాడు పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న ఐదుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. మునుగోడు ఉప  ఎన్నికల నేపథ్యంలో   ఈ  నగదును తరలిస్తున్నారా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.బేగం బజారు  నుండి కొందరు  మునుగోడుకు డబ్బును తరలిస్తున్నట్టుగా  పోలీసులకు  సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు ఈ నగదును స్వాధీనం  చేసుకున్నారు.

ఇవాళ  ఉదయం కూడ  రూ.10  లక్షలను  పోలీసులు  సీజ్  చేశారు.పంజాగుట్ట పోలీస్ స్టేషన్  పరిధిలో  ఈ  ఘటన  చోటు  చేసుకుంది.  హవాలా  మార్గంలో  నగదును  తరలిస్తున్న  సమయంలో  పోలీసులు  సీజ్  చేశారు. నగదును తరలిస్తున్న ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు.హైద్రాబాద్ లో  ఇటీవల  కాలంలో హవాలా  రూపంలో  నగదును తరలిస్తుండగా పలువురు పోలీసులకు పట్టబడ్డారు.

ఈ  నెల 11న  హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు.  నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.  నగరానికి  చెందిన  వ్యాపారికి  చెందిన నగదుగా  పోలీసులు గుర్తించారు. ఈ నెల  10న  హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు..  వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో నగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. 

 ఈ నెల 7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను  హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్  చేశారుఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు తరలిస్తున్న సమయంలో  పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

 ఈ  నెల  21న  హైద్రాబాద్  నగరంలో  సుమారు  కోటికిపైగా  నగదును  పోలీసులు సీజ్  చేశారు. నలుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు నగదును  తరలిస్తున్న  కారుతో పాటు  నలుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.

alsoread:హైద్రాబాద్‌లో హవాలా కలకలం: రూ. 10 లక్షల నగదు సీజ్ , పోలీసుల అదుపులో ఇద్దరు

2020  సెప్టెంబర్ 15న  రూ. 3.75 కోట్ల నగదును పోలీసులు  సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న  నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  హవాలా రూపంలో  ఈ  నగదును  తరలిస్తున్న  సమయంలో  పోలీసులు సీజ్  చేశారు. 2020 అక్టోబర్ 31న  హైద్రాబాద్  టాస్క్ పోర్స్  పోలీసులు రూ. 30  లక్షల నగదును సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios