Asianet News TeluguAsianet News Telugu

కూకట్‌పల్లి రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య: 4 రాష్ట్రాల్లో గురూజీ కోసం పోలీసుల గాలింపు


హైద్రాబాద్ లో కూకట్‌పల్లిలో ఉంటున్న రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డిని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురూజీ కోసం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Hyderabad police searching for accused in Vijayabhaskar Reddy murder case lns
Author
Hyderabad, First Published Aug 8, 2021, 3:21 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి హస్టల్‌లో ఉన్న రియల్ ఏస్టేట్ వ్యాపారి  విజయ్ భాస్కర్ హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న  గరూజీ కోసం నాలుగు రాష్ట్రాల్లో సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.నెల్లూరు జిల్లా కావలికి చెందిన గడ్డం విజయ్‌భాస్కర్‌రెడ్డి(63) హైదరాబాద్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయన ఉంటున్నాడు.గత నెల 20వ తేదీ నుండి ఆయన కన్పించకుండాపోయాడు. ఆయన అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగు చూసింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు సమీపంలోని సున్నిపెంటలో విజయ్ భాస్కర్ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. కావలిలోనే గురూజీగా ప్రచారం చేసుకొంటున్న వ్యక్తి తన శిష్యుల సహాయంతో విజయ్ భాస్కర్ రెడ్డిని  హత్య చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు.భూముల కొనుగోలు కోసం గురూజీ విజయ్‌భాస్కర్ రెడ్డిని  సంప్రదించాడు. విజయ్ భాస్కర్ చూపిన స్థలాలను కొనుగోలు ఆయనకు కమిషన్ ఇవ్వలేదు.

తాను మోసం చేసిన విజయ్ భాస్కర్ రెడ్డి  గురూజీ అక్రమాలపై ఆరా తీశాడు. ఈ విషయమై  నెల్లూరు. హైద్రాబాద్ పోలీసులకు విజయ్‌భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై తన శిష్యులతో గురూజీ విజయ్ ను బెదిరించాడు. విజయ్ భాస్కర్ రెడ్డిని హత్య చేసిన నలుగురిని  పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్‌పేట భూములను గురూజీ కొట్టేసేందుకు ప్లాన్ చేశారని కూడ పోలీసులు అనుమానిస్తున్నారు.  ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పాత్రపై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios