వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం
నగరంలోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన వరదలో కొట్టుకుపోయిన నగల బ్యాగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన వరదలో కొట్టుకుపోయిన నగల బ్యాగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.
also read:హైద్రాబాద్ వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం: గంటల తర్వాత దొరికింది
ఓ కస్టమర్ కు బంగారు ఆభరణాలను చూపించేందుకు ఓ జ్యూయలరీ సంస్థలో పనిచేస్తున్న సేల్స్ మెన్ బైక్ పై నగల బ్యాగ్ పెట్టుకొని వచ్చాడు.అయితే నగల బ్యాగ్ వరదలో కొట్టుకుపోయిందని ఆయన యజమానికి ఫిర్యాదు చేశాడు. ఈ నగల షాపులో పనిచేసే ఇతర సిబ్బంది, పోలీసులు కూడ వరద నీటిలో నగల బ్యాగ్ కోసం గాలించారు.
ఈ నెల 10వ తేదీన నగల బ్యాగు లభ్యమైంది. అయితే ఈ బ్యాగులో నగలు లేకపోవడం మరింత అనుమానాలకు దారి తీసింది.ఈ విషయమై పోలీసులు సేల్స్ మెన్ తో పాటు పలువురిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో నిందితులు అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు.
ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు ప్రకటించారు. నిందితుల నుండి కోటి రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.