Asianet News TeluguAsianet News Telugu

ఐటీ అధికారులంటూ సికింద్రాబాద్ జ్యుయలరీ షాప్ లో దోపీడీ : థానేలో నలుగురు అరెస్ట్

సికింద్రాబాద్  జ్యుయలరీ షాపు దోపీడీ కేసులో  నలుగురిని  హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్  పోలీసులు  ఇవాళ  అరెస్ట్  చేశారు.  ఐటీ అధికారుల పేరుతో  సికింద్రాబాద్  జ్యుయలరీ షాపు  నుండి  రెండు కిలోల బంగారాన్ని  దుండగులు దోచుకున్నారు.

Hyderabad  Police  Arrested  Four  For Robbery  At  Secunderabad  jewellery shop lns
Author
First Published May 29, 2023, 2:25 PM IST

 

హైదరాబాద్:  సికింద్రాబాద్  జ్యుయలరీ  షాపు దోపీడీ  కేసులో పురోగతి సాధించారు  పోలీసులు . ఐటీ  అధికారుల  పేరుతో  సికింద్రాబాద్  లోని  జ్యుయలరీ  షాపులో   రెండు  కిలోల బంగారం  దోచుకున్న  ముఠాను  హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్  పోలీసులు  సోమవారం నాడు అరెస్ట్  చేశారు.మహారాష్ట్రలోని  థానేలో జకీర్,  రహీమ్ , ప్రవీణ్,  అక్షయ్ లను   ఇవాళ  హైద్రాబాద్  టాస్క్ ఫోర్స్  పోలీసులు  అరెస్ట్  చేశారు.

సికింద్రాబాద్ లోని  ఓ జ్యుయలరీ షాపులో   దోపీడీ దొంగల ముఠా  ఐటీ అధికారులుగా   చెప్పుకుంటూ  తనిఖీలు  నిర్వహించారు.  జ్యుయలరీ దుకాణం  నుండి సుమారు  రెండు  కిలోల బంగారాన్ని దుండగులు  దోచుకున్నారు.  ఈ విషయమై  జ్యుయలరీ  దుకాణ యజమాని  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.  ఈ ప్రాంతంలోని  సీసీటీవీ  పుటేజీ  ఆధారంగా  పోలీసులు  దర్యాప్తును  ప్రారంభించారు. 

సికింద్రాబాద్  ప్రాంతంలోని  పలు  జ్యయలరీ దుకాణాలపై   దోపీడీ గ్యాంగ్  రెక్కీ నిర్వహించింది.  చివరికి    సికింద్రాబాద్ లోని  నాలుగో అంతస్తులో  ఉన్న ఓ జ్యుయలరీ దుకాణాన్ని  ఎంచుకొని   దోపీడీకి  పాల్పడ్డారు.  

జ్యుయలరీ దుకాణంలో  దోపీడీకి పాల్పడడానికి  వారం రోజుల ముందుగా   ఇదే  ప్రాంతంలోని  ఓ లాడ్జీలో దుండగలు ఉన్నారని  పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు . జ్యుయలరీ దుకాణంలో దోపీడీకి పాల్పడిన తర్వాత దుండగులు మహారాష్ట్రకు పారిపోయారు.  మహరాష్ట్ర  పోలీసుల సహకారంతో  హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్  పోలీసులు  ఇవాళ నలుగురు నిందితులను  అరెస్ట్  చేశారు. ఈ కేసుతో  సంబంధం ఉన్న మరో నలుగురి  కోసం పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios