పంజగుట్ట వద్ద బస్సులో కాల్పులు: పోలీసుల అదుపులో శ్రీనివాస్
పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన ఏపీ ఇంటలిజెన్స్ వింగ్ సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ను హైద్రాబాద్ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకొన్నారు.
హైదరాబాద్: పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన ఏపీ ఇంటలిజెన్స్ వింగ్ సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ను హైద్రాబాద్ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకొన్నారు.
గురువారం ఉదయం కాల్పులు జరిపిన శ్రీనివాస్ ను పోలీసులు కూకట్పల్లి వద్ద అదుపులోకి తీసుకొన్నారు.ఈ విషయమై శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఠాకూర్ కూడ స్పందించారు.
జనాల మధ్య కాల్పులు జరపడం తీవ్రమైన నేరమని ఆయన అభిప్రాయపడ్డారు.శ్రీనివాస్ వ్యవహారంపై కూడ విచారణ చేస్తున్నామని ఠాకూర్ ప్రకటించారు. మరో వైపు ఎలాంటి ఒత్తిడి కూడ తమ శాఖలో లేదని ఠాకూర్ ప్రకటించారు.
సంబంధిత వార్తలు
పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు: ఏపీ పోలీసు పనే
పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు