గోకుల్చాట్, లుంబిని పార్క్ పేలుళ్లు: వాదనలు పూర్తి, ఆగష్టు 27న తీర్పు
గోకుల్చాట్, లుంబిని పార్క్ పేలుళ్లపై విచారణ పూర్తైంది. ఈ నెల 27వ తేదీన కోర్టు తీర్పును వెలువరించనుంది. 12 ఏళ్ల తర్వాత ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
హైదరాబాద్: గోకుల్చాట్, లుంబిని పార్క్ పేలుళ్లపై విచారణ పూర్తైంది. ఈ నెల 27వ తేదీన కోర్టు తీర్పును వెలువరించనుంది. 12 ఏళ్ల తర్వాత ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్లో , ఆ తర్వాత గోకుల్ చాట్లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా ఎన్ఐఏ నిర్దారించింది.
ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్ను పోలీసులు 2008 అక్టోబర్లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్ పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు.
ఈ ఘటనపై వాదనలు పూర్తయ్యాయి.ఈ వాదనలకు సంబంధించి ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును ఈ నెల 27వ తేదీన వెలువర్చే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును ఆగష్టు 27వ తేదీన కోర్టు వెలువర్చనుంది.
ఈ వార్త చదవండి:9/11 దాడుల లీడర్ అట్టా కుమార్తెతో బిన్ లాడెన్ కొడుకు హంజా పెళ్లి